పంచ ద్వారకలు
(IPLTOURS)
(IPLTOURS)
శ్రీకృష్ణుని జన్మస్థానము మధురఅయిననూ యుక్తవయస్సు వచ్చువరకు బాల్యమంతయు పెరిగినది ద్వారకమరియు పరిసరములలోనే. చివరకు నిర్యాణము పొందినదికూడా ద్వారకసమీపములోనే. శ్రీకృష్ణుడు పెరిగియున్న ప్రదేశములందు గుజరాత్ మరియు రాజస్థాన్ రాస్త్రములలోఉన్న పవిత్రప్రదేశములలో పంచద్వారకలు. ఇందు మొదటి స్థానము అప్పటి సౌరాష్ట్రదేశము ప్రస్తుత గుజరాత్నందలి ద్వారక. ఇచ్చటినుండి కృష్ణుడు రాజ్యపాలన చేసినాడు. దీనిపిమ్మట బెట్ ద్వారక, దాకోర్ కూడా మహారాష్ట్రలోనేఉన్నవి. తదుపరి రాజస్థాన్ లోని నాథ్ ద్వారా నందున్న శ్రీనాథ్ జీ మరియు కన్ క్రోలినందున్న దివ్యక్షేత్రములు.
పంచద్వారకలు దర్శించవలేనన్న అభిలాషకలవారు రైలుద్వారా దేశములోని అన్నిప్రాంతములనుండి సోమనాధ్ చేరుకొని సోమనాధ్ నందు ప్రధమజ్యోతిర్లింగమైన సోమనాధేశ్వరుని దర్శించుకొని సమీపములో నున్న వారెవాల్ నందు శ్రీకృష్ణుని నిర్యాణప్రదేశము బల్కితీర్ధం దర్శించవచ్చును. ఆచటినుండి ద్వారక రైలుపై ప్రయాణించి ద్వారక చేరుకోవచ్చును. ద్వారకనందు ద్వారకాదీష్, ఇతర ఆలయములు సందర్శించి సమీపములోనున్న 8వ జ్యోతిర్లింగము అయిన నాగనాథ్ దర్శించి ఓక్కా చేరుకొని నముద్రముపై మోటారుబోటునందు ప్రయాణించి బెట్ ద్వారకచేరి ఆచటి శ్రీకృష్ణుని ఇతర ఆలయములు దర్శించుకొని తిరిగి అహమ్మదాబాద్ చేరుకొని ఆచటినుండి రైలుద్వారా కానీ రోడ్డు మార్గముద్వారా సుమారు 320కి.మీ దూరములోనున్న కన్ క్రోలీ నందున్న ద్వారకాదీష్ మందిరం దర్శించి పిమ్మట కన్ క్రోలీనుండి 17కి.మీ దూరములోనున్న నాధ్ ద్వారా నందున్న శ్రీనాధ్ జీని దర్శించి తిరిగి అహమ్మదాబాద్ చేరవచ్చును. ఆచటినుండి తిరిగి స్వస్థలము చేరుకోనవచ్చును. ఈయాత్ర సంవత్సరములో ఏసమయములోనైనను చేయవచ్చును. మతప్రాతిపదికపై చూసుకొన్నట్లయిన జన్మాష్టమిరోజున ద్వారకా, బెట్ ద్వారకా, దాకోర్, కన్ క్రోలి మరియు శ్రీనాథ్ జి ఆలయములు దర్శించిన దేశములోని అన్నిప్రాంతములనుండి వచ్చుయాత్రికులతో శ్రీకృష్ణుని పుట్టినరోజు వేడుకలతో కోలాహలముగా ఉండును. పంచద్వారకలందు వసతిసౌకర్యములు లభ్యము. కుటుంభములతో వసతిపొందుటకు తక్కువ అద్దె ప్రాతిపదికపై అనేకమైన ధర్మశాలలు లభ్యము. అంతేకాకుండా అనేకమైన వసతులతోకూడిన హోటల్స్ లభ్యముగా నుండును. పంచద్వారకలయందు శాకాహార భోజనము లభ్యము. అంతేకాక గుజరాతీభోజనము మరియు రాజస్థాన్ తాళీలభ్యము.
పంచద్వారకయాత్ర చేయునప్పుడు ద్వారకతోపాటుగా ద్వాదశజ్యోతిర్లిగములలో ఎనిమిదవ జ్యోతిర్లింగమైన నాగనాధ్ లేదా నాగేశ్వర్, మరియు జ్యోతిర్లింగములలో ప్రధమజ్యోతిర్లింగము, మహమ్మదీయుల దండయాత్రలో అనేకమార్లు పాడుచేయబడి మరలామరలా మునర్నిమింపబడిన సోమనాధ్ జ్యోతిర్లింగముతోపాటుగా పలు విలువైనచిత్రములు కలిగియున్నతుక్క్మిణీదేవి మందిరము తదితర ఆలయములును దర్శించవచ్చును. దాకోర్ సందర్శించునప్పుడు గల్టేశ్వర్ అనువిహారస్థలమును మరియు శివాలయమును దర్శించవచ్చును. కంక్రోలీవద్ద రాజస్థాన్ ప్రభుత్వము అభివృద్ధిపరచిన కుత్రిమ సరస్సులను మరియు నాథ్ ద్వారా నందు సుమారు 600 సంవత్సరములకు పూర్వము నిర్మించబడిన చర్భుజా విశ్నాలయమును దర్శించవచ్చును. ఈ యాత్రానందు శివకేశవులను ఇరువురను సందర్శించవచ్చును. మరియు బెట్ ద్వారకదర్శనములో ప్రకృతి రమణీయతకు వయోబేధాము లేకుండా అందరూ మహదానందము ఉల్లాసము పొందవచ్చును.
ద్వారక
బెట్ ద్వారక
రాంచోడ్రైజీ ఆలయం డాకోర్
నాథద్వారా శ్రీనాథ్జీ ఆలయం
కంక్రోలి ద్వారకాధీష్ దేవాలయం
IPLTOURS – Indian Pilgrim Tours