విశ్వంలోని జీవరాశులలో మానవజన్మ మహోన్నతమైనది. మానవజన్మ లభించడం పూర్వజన్మ సుకృతం.
అన్నిజీవులందు మానవులకు చూడగల, వినగల మరియు మాట్లాడగల సామర్థ్యంతో పాటు మంచిచెడులు గుర్తించే విచక్షణాజ్ఞానం ఉంది. ధ్యానం ద్వారా భగవంతుడిని ఆరాధించడానికి, తీర్థయాత్రలలో పుణ్యక్షేత్రముల సందర్శనల ద్వారా, సత్కర్మలద్వారా పూర్వీకులకు మోక్షాన్ని కలిగించి, తాము పునర్జన్మలేకుండా పరమాత్మ సన్నిధి పొందగలిగే విచక్షణ మానవులకు ఉంది. అంతేకాక, మానవజాతి ఇతరులకు హాని మరియు బాధలను కలిగించడం ద్వారా పాపంచేసి తమకు, పూర్వీకులకు నరక యాతనను కలిగించవచ్చు.
65 సంవత్సరాల మానవ జీవితంలో 20 సంవత్సరాలు నిద్రలో మరియు 30 నుండి 35 సంవత్సరాలు విద్య, కుటుంబ వ్యవహారాలలో తెలియకుండానే గడిచిపోతుంది. 5 నుండి 10 సంవత్సరాల చిన్నవ్యవధి మాత్రం దేవుని ఆరాధన, ధ్యానం మరియు విహార ప్రదేశాలు, తీర్థయాత్రలో పవిత్ర పుణ్యక్షేత్రాలను దర్శనంకోసం లభ్యమౌతుంది.
సాధారణంగా బాధ్యతలనుండి విముక్తిపొందే వయస్సులో శరీరం మరియు మనస్సు నిస్సత్తువకి లోనవుతాయి. పుణ్యక్షేత్రాలు దర్శించడం, తీర్థయాత్రలు చేయడంవల్ల మనస్సుకు ఉపశమనం మరియు శరీరానికి నూతనతేజస్సు లభిస్తుంది.
అనేకమంది దైనందిన కార్యక్రమాలలో ఆహ్లాదం కోల్పోయి శారీరకంగా మానసికంగా ఒత్తిడికి గురౌతున్నారు. వారిశరీరం మరియు మనస్సు ఉత్సాహం మరియు ఉత్తేజాన్ని పొందడానికి ఉపశమనం అవసరం.
పుణ్యక్షేత్రాలు మరియు పర్యాటక ప్రదేశాలతో కూడిన కొన్ని రోజుల పాటు జరుపు తీర్థయాత్రలయందు కొత్త ప్రదేశాలను సందర్శించడం ద్వారా శరీరం మరియు మనస్సు ఒత్తిడినుండి ఉపశమనం పొందుతాయని వైద్యులు సూచిస్తున్నారు. కావున తీర్థయాత్రలు మనశ్శాంతిని అందజేస్తాయని మరియు శరీరాన్ని మరియు ఆత్మను ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతాయని సుస్పష్టమవుతుంది
శివకేశవుల మరియు ఇతర దైవముల ఆలయములు, పుణ్యక్షేత్రములు విహారప్రదేశములతో కలసియున్న ప్రదేశాలు అనేకం మనదేశంలో ఉన్నాయి. ఊటీ మరియు కొడైకెనాల్ వంటి విశ్రాంతి విడుదులతో పాటు, పుణ్యక్షేత్రాలు దర్శించడంవల్ల ఒత్తిడినుండి శరీరం మరియు మనస్సుకు ఉపశమనం కలుగుతుంది. మన దేశంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠములు, పంచ భూత లింగములు, సప్త సుబ్రహ్మణ్య క్షేత్రములు, పంచారామాలు, తిరుపతి, అనంత పద్మనాభ స్వామి, బద్రీనాథ్, పంచ ద్వారకలు, జగన్నాథ్ వంటి విష్ణుక్షేత్రాలతో పాటుగా అనేక దివ్య ప్రదేశాలు ఉన్నాయి.
IPLTours పుణ్యక్షేత్రముల పౌరాణిక మరియు స్థానిక కథనములతో పాటుగా విహారప్రదేశముల సమాచారం సంభంధిత చిత్రములతో ఒకే క్లిక్ నందు అందజేయాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించ బడింది. సమాచారాన్ని చూసి అమూల్యమైన అభిప్రాయాలను అందజేయడానికి వీక్షకులకు ఇదే మా సాదరఆహ్వానం.
తాజా ముఖ్యాంశాలు
మేము భారత దేశమునందు కల ద్వాదశ జ్యోతిర్లింగములు మరియు లభ్యముగా కల 17/18 ఆష్టా దశ శక్తి పీఠములు ఒకమారు కంటే ఎక్కువగా దర్శించి మా స్వానుభవముతో ఈ పుణ్య క్షేత్ర సందర్శన యందు కొద్ది శ్రమ కలిగిననూ శారీరకముగాను మానసికముగాను స్వాంతన ప్రశాంతత పొందియున్నాము.
మా స్వానుభముము ఇతర యాత్రికులకు పంచి వారికి కూడా సహకారమండించ వలేనను ఉద్ధేశ్యముతో
ఈ IPLTOURS ప్రారంభించి యున్నాము.
మీరు ఎలా ప్రయాణించడానికి ఇష్టపడతారు?
మన పుణ్యక్షేత్రాలు పవిత్రతకి మారుపేరు. మానసిక ప్రశాంతత ఇచ్చి మనలోని టెన్షన్లు దూరం చేస్తాయి. చాలామంది భారతదేశంలోని పుణ్య క్షేత్రాలు తిరుగుదామని భగవంతుడిని దర్శించుకొందామని చాలా కోరికగా ఉన్నా, వయస్సు ప్రాభల్యం వలన గాని లేదా ఆర్ధికస్తితి రీత్యా ఎంత ఖర్చు అవుతుందో అని విచారించి ఆ ప్రయత్నం విరమించు కుంటున్నారు. అటువంటి వారికి తక్కువ ఖర్చులో ఎక్కువ పుణ్య క్షేత్రాలు దర్శించే విధముగా ప్లానుచేసి టూరుప్లానులు (రైలు, బస్సు టిక్కెట్లు, వసతి సదుపాయములు మరియు పరిశుభ్రమైన భోజనం దొరికేటట్లుగా తయారుచేసి) అందించుదామనే సంకల్పమే మా ఈ IPLTOURS లక్ష్యం.
పుణ్యక్షేత్ర సందర్శనం – కలిగిస్తుంది మీకు నూతన ఉత్సాహం.