ద్వారక

(IPLTOURS)

ద్వారక పూర్వపు సౌరాష్ట్ర మరియు ప్రస్తుత గుజరాత్ రాష్ట్రములో అరేబియాసముద్రపు ఒడ్డుననున్న ద్వీపకల్పము. ఈదేవభూమి ద్వారకాజిల్లానందు గౌతమీనదితీరము నందు గల పురాతన నగరము. ఇది పురాణములలో పేర్కొనిన ప్రకారము సుమారు నాలుగువేల సంవత్సరములకు పూర్వము రాజ్యపాలనచేసిన శ్రీకృష్ణునిపాలనలోని బంగారు రాజ్యము. ద్వారకఅను పేరు సృష్టికిమూలమైన బ్రహ్మయొక్క ఆద్యాత్మిక ఐఖ్యతకు ముఖద్వారము వంటిది. ఈపట్టణము ప్రతిసంవత్సము జన్మాష్టమినాడు శ్రీకృష్ణుని పుట్టినరోజు అత్యంతవైభవముగా జరిపెడి ద్వారకాదీష్ ఆలయమునకు స్వస్థలము. పురాతన గ్రంధములైన దివ్యప్రభంధములలో ప్రముఖముగా పేర్కొనబడి శ్రీమహావిష్ణువునకు అత్యంత ప్రీతికరమైన బదరీనాథ్, పూరీ, రామేశ్వరంలతోపాటు చార్ ధామ్ నందు నాలుగవపుణ్యక్షేత్రము. మరియు మహావిష్ణువు 108 దివ్యదేశములందు ఒకటిగా భావించ బడుచున్నది. శ్రీకృష్ణుని రాజ్యమునకు ముఖ్య పట్టణముగా సుపరిచితము. గుజరాత్ రాస్త్రమునకు మొదటి ముఖ్యపట్టణము. మోక్షపురిగా భావించబడు ద్వారక అనగా ముఖద్వారము అని అర్ధము. తన మేనమామ కంసుని మధురనందు సంహరించిన పిమ్మట కృష్ణుడు ఇచ్చటనే స్థిర నివాసము ఏర్పరచు కొనినాడు. ద్వారక నిర్మాణమునకు కృష్ణుడు మధురనుండి వచ్చిన పిమ్మట గుజరాత్ సంస్కృతికి సంతసించి సముద్రమునుండి దాదాపు 150 కిలోమీటర్ల భూమినందు ద్వారకా నిర్మాణము చేసినాడు. ఆర్యులు ద్వారక ముఖ్యపట్టణముగా రాజ్యపాలన చేసినారు. మగధరాజైన జరాసంధవధపిమ్మట కృష్ణుడు ద్వారకనందు నివశించవలెనని నిర్ణయించుకొనినాడు. కృష్ణుడు తనతల్లితండ్రులతో బెట్ ద్వారక నందు నివసించుచూ ద్వారకనుండి రాజ్య పాలన చేసినాడు. 

ద్వారకలోని ద్వారకాదీష్ కృష్ణుని ఆలయము నాలుగువేలసంవత్సరముల పూర్వము నిర్మించబడి మహమ్మదీయుల దాడినందు ద్వంసము కాబడినదని మరలా 16 వశతాబ్దములో పునర్నిర్మించబడినట్లు, ద్వారకలో ద్వారకాదీష్ ఆలయం, రుక్మిణీదేవి ఆలయం మరియు గోమతిఘాట్ చూడతగినవి. ఇచట లైట్ హౌస్ ప్రత్యేకఆకర్షణ. 1861 సం.లో ద్వారకాదీష్ ఆలయం పురుద్ధరించబడి బరోడామహారాజుచే ఆలయ శిఖరమునకు బంగారుకలశము ఏర్పాటు చేయబడినది. ద్వారకను భారతదేశములోగల 12 సాంస్కృతి పరిరక్షణ కేంద్రములలో ఒకటిగా ప్రకటించి కేంద్రప్రభుత్వమువారి సాంస్కృతిక కేంద్రముల పరిరక్షణ పదకముయందు 1960 సంవత్సరమునందు చేర్చుట జరిగినది. గోమతినదిపై బెట్ ద్వారకకు పర్యాటకులను ఆకర్షించునుద్దేశ్యముతో 2005 నందు సస్పెన్షన్ వంతెన ప్రతిపాదించి అడ్డంకులను దాటుకొని 2016 సం లో ద్వారకను శ్రీకృష్ణుని చిన్ననాటి మిత్రుడు సుధామునిపేరుతో సుధామసేతు అనువంతెన ప్రధాన ద్వారకనందుకల జగత్ మందిరము నుండి ద్వీపమునందు పంచకుల్ కలుపుచూ రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు గుజరాత్ పర్యాటకసంస్తవారితో కలిసి నిర్మించినారు. గోమతీనదివద్ద పూర్వము నౌకాశ్రయము ఉండేదిది. ద్వారక దేశములోని ఇతర పట్టణములతో విమానమార్గము, రైలుమార్గము మరియు రోడ్డుమార్గము ద్వారా కలుపబడియున్నది. ద్వారకనందు ద్వారకాదీష్ ఆలయము, గోమతి ఘాట్, రుక్మిణీదేవి ఆలయం ముఖ్యమైనవి.

Dwaraka

శ్రీ ద్వారకాధీశ ఆలయం

రాజా జగత్ సింగ్ చే నిర్మితము కాబడుట వలన జగత్ మందిరముగా పిలువబడు ద్వారకాదీష్ ఆలయం ద్వారక పట్టణ నడిబొడ్డున ఉన్నది. పూర్వము శ్రీక్సృష్ణుడు నిర్మించిన పట్టణము నందు ఈ ఆలయము సముద్ర మట్టముతో సమాన మైన ఎత్తు ఎత్తుకలిగి పశ్చిమ ముఖముగా నిర్మించబడినది. అంతరాలయము లేదా గర్భగుడినందు నాలుగు చేతులతో త్రివిక్రముడుగా పిలువబడు ద్వారకా దేశుడు ముఖ్యదేవతగా కొలువబడు ఈ ఆలయ శిఖరముపై చంద్రుడు సూర్యులు చిత్రములతో కూడిన జండా ఎగురవేయబడి యుండును. దర్శస సమయములు: ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 వరకు తిరిగి సాయంత్రం 5 నుండి 9-30 వరకు.

గోమతీ ఘాట్ 

గోమతీ నది యొక్క ఘాట్ నుండి గోమతీ నది చేరుటకు గల మెట్లద్వారా యాత్రికులు నది చేరుకొని పవిత్ర గోమతీ నది నందు స్నానము చేసి ద్వారకాదీష్ ఆలయము దర్శింతురు. ఈ ఘాట్ వద్ద సముద్రుని విగ్రహములతో పాటుగా సరస్వతి, లక్ష్మణ విగ్రహములు కూడా కలవు. గోమతి నది సముద్రములో కలియు సంగమ ప్రదేశమునందు సముద్ర నారాయణ ఆలయ, విష్ణువు ఆయుధమైన చక్రము ముద్రతో రాయి కల చక్రనారాయణ ఆలయం, వశిస్ట మహర్షితో భూమికి తేబడినదని చెప్పబడు గోమతీ నది విగ్రహము కల గోమతీ ఆలయం ఉన్నవి.

రుక్మిణీదేవి ఆలయం

సుమారు 2 కి. మీ దూరములో కృష్ణుని పట్టపురాణిఅయిన రుక్మిణీదేవి ఆలయము కలదు. ఈఆలయము సుమారు 2500 సంత్సరములకు పూర్వముదని చెప్పబడుతున్నది కానీ వాస్తవ రూపము 12వ శతాబ్దము లోనిదిగా కనపడుతుంది. ఆలయము గోపుర భాగము మరియు బయటి గోడలు కూడా వివిధ దేవతా ప్రతిమలతో చాలా అందముగా యుండును. అంతరాలయమునందు రుక్మిణీదేవి విగ్రహము మరియు గజరాజు (ఏనుగుల) బొమ్మలు చెక్కబడియుండును. ఇవియే కాక కాలిబారి ఆలయం, సిద్ధివినాయక ఆలయం, గోలోక్ ధామ్ మరియు ఇస్కాన్ ఆలయం చూడతగ్గవి. ద్వారకనందు బసచేయుటకు అనేక చిన్నతరహా, మధ్యతరహా మరియు ఉన్నతశ్రేణి హోటల్స్ ఉన్నవి. భోజన సదుపాయము కొరకు అనేక హోటల్స్ నందు ఉత్తర, దక్షణ భారతదేశ వంటకములు లభించును.

ఈ ముక్తినాధ  క్షేత్రము మహాదేవి లేదా దేవీభగవతిగా పిలువబడు 108 శక్తి సిద్ధిపీఠములలో ఒకటి. శివుడు సతీ దేవి దేహమును ఖండించినప్పుడు ఆ భాగములు పడిన ప్రదేశములు శక్తిపీతములు. సతీదేవి నుదుటి భాగము ఇచట పడినట్లునమ్మేదరు. ముక్తినాధ్ నందలి శక్తి గండకిచండీ గాను మరియు భైరవుడు చక్రపాణిగాను పిలువ బడుచున్నారు.