మధ్య మహేశ్వర్

(2వ కేదార్)
(IPLTOURS)

ఉత్తరాఖంఢ్ లో వున్న అనేక యాత్రా స్థలాలు కాలినడకనే వెళ్ళవలసి వుంటుంది శారిరక అలసట తెలియకుండా ఉండేందుకు అన్నట్లు అక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా వుంటుంది. సంవత్సరానికి ఇక్కడ రెండే కాలాలు. ఒకటి సాధారణ శీతాకాలం, రెండు మంచు కురిసే శీతాకాలం గా చెప్పవచ్చు. అక్కడి వాతావరణ పరిస్థితులను బట్టి ఆలయాలను మందిరట్రస్టు ఎప్పుడు తెరవాలి అనేది నిర్ణయిస్తుంది . 

నడవలేని వారికోసం గుఱ్ఱాలు, డోలీలు దొరుకుతాయి. చాలా చోట్ల చాలా ఎత్తు (స్టీప్) ఎక్కవలసిరావడంతో కాస్త ఆయాసం ఎక్కువగా అనిపిస్తుంది. ఈ ప్రదేశానికి పర్వతారోహకులు తప్ప మామూలు యాత్రికులు చాలా తక్కువ సంఖ్యలో వస్తూ వుంటారు. అందుకనేమో యీదారి కొంచెం నిర్మానుష్యంగా వుంటుంది. కాలి నడక మొదలయ్యే ప్రాంతంలో మాత్రమే చల్లని, వేడి పానీయాలు తినుబండారాలు దొరకుతాయి. కోవెల ప్రాంతంలో అన్నీ దొరుకుతాయి. హిమాలయాలలో ప్రొద్దున్నే వీలైతే సూర్యోదయానికి పూర్వం యాత్ర మొదలుపెట్టి సూర్యాస్తమయానికి ముందు లేక వెంటనే ప్రయాణం నిలిపివేస్తే యాత్రికులు చాలా ఆపదల నుంచి తప్పించుకోవచ్చు. ఇక్కడి వాతావరణం యెండ వానలతో నమ్మలేని విధంగా మారుతూ వుంటుంది.

మధ్య మహేశ్వర్ పంచ కేదార్లలో రెండవ ఆలయము. కేదారేశ్వర్ దర్శనము పిమ్మట తిరిగి కేదార్నాధ్ నుండి గౌరికుండ్  14 కి.మీ. కాలినడక/పల్లకి/గుర్రముపై చేరి ఆచటినుండి 40 కి.మీ రోడ్డు మార్గము ద్వారా గుప్తాక్షి ద్వారా కుండ్ చేరవరసి ఉంటుంది. కుండ్ నుండి ఉకీమఠ్ 16 కి.మీ. అచటినుండి మాంసునా, రాసు సరస్సు  ఆచటి నుండి ఉనియన మొత్తము 16 కి.మీ. రోడ్డు ప్రయాణము చేయవలసి ఉంటుంది. ఉనియన ద్వారా రాంన్సీ 4 కి.మే. రాన్సీ నుండి 16 కి.మీ కాలినడకన ప్రయాణించి మద్య మహేశ్వర్ చేరుకోనవలసి ఉంటుంది. మరియొక రూటు ప్రకారము గుపాక్షి నుండి 17 కి.మీ గౌంఢర్మరియు ఆచటినుండి మధ్య మహేశ్వర్ 17 కి.మీ పర్వతా రోహణము ద్వారా సుమారు 16 గంటలు ప్రయాణించి చేరుకోనవలసి ఉంటుంది. మధ్యమహేశ్వర్ నందు రాత్రికి బస చేయవలెను. మధ్య మహేశ్వర్ నందు మాత్రము బస చేయుటకు లభ్యతను బట్టి వసతి గృహము కేటాయించ బడును. మరి ఎచ్చటను వసతి సౌకర్యము లేదు. ఉత్తరాంచల్ టూరిజం వారు మనిషికి రూ 7500/- చార్జీతో మార్గమధ్యమున భోజన సౌకర్యముతో దర్శన మునకు ఏర్పాటు చేసేదరు. కానీ 5 మందికి తక్కువ కాకుండా యాత్రికులు సమూహము కావలెను. 

Madhyamaheshwar Mandir, Uttarakhand

మధ్యమహేశ్వర్ ఆలయము సముద్ర మట్టమునకు సుమారు 11000 అడుగుల ఎత్తులో ఉన్నది. ఈ ఆలయము చుట్టూ చౌఖంబా, నీలకంఠ్ మరియు కేదార్నాథ్ మంచుతో కప్పబడిన శిఖరములు ఉన్నవి.  స్థల పురాణం ప్రకారం మహాభారత కాలమునందు పాండవులు తమ దాయాదులు కౌరవులను కురుక్షేత్ర సంగ్రామమునందు  నిర్జించినారు. 

పాండవులు యుద్ధము నందు చేసిన పాపములైన గోత్రీకుల హత్య మరియు గోహత్యల నుండి  విముక్తులు కావలెనని తలంచి తమ రాజ్య భారమును తమ వంశీకుడు పరీక్షిత్తునకువప్పగించి శివుని దర్శించి దీవెనలు పొందవలెనని వెతుకుచూ బయలుదేరినారు. వారు శివునికి ప్రీతి పాత్రమైన వారణాశి పుణ్య క్షేత్రమును చేరగా శివుడు వారిపై కురుక్షేత్ర సంగ్రామమునందు వారివలన కలిగిన ప్రాణ నష్టమునకు కోపగించి వారిప్రార్ధనలను వినిపించుకోకుండా వారినుండి తప్పించు కొనవలెనని తలచి ఎద్దు (నంది) రూపముపొంది హిమాలయ ప్రాంతమునందు అదృశ్యమైనాడు. వారణాశినందు శివుని కనుగొనలేక పాండవులు హిమాలయములకు వెళ్ళినారు. భీముడు గుప్తాక్షి వద్ద రెండు పర్వతముల మధ్య నిలబడి చూడగా నంది రూపములో శివుడు గుప్తాక్షి వద్ద గడ్డి మేయుచూ కనిపించినాడు. భీముడు నంది తోకపట్టుకొని ఆపుటకు ప్రయత్నించగా ఆచటి నుండి అదృశ్యమై తరువాతప్రత్యక్షమై ఆరుభాగములుగా విడిపోయినది. మూపుర భాగము కేదార్నాధ్, చేతులు తుంగనాధ్, బొడ్డు మరియు ఉదరభాగము మధ్య మహేశ్వర్, ముఖ భాగము రుద్రనాధ్ మరియు జుట్టు కల్పెశ్వర్ లతో పాటు తల భాగము నేపాల్ నందు ఖాట్మండునకు 25 కి.మీ దూరములో కల చౌలి మహేశ్వర్ నందు పడినవి. పాండవులు శివుని కొలుచుటకు గాను అయిదు స్తలములలోనూ ఆలయములు నిర్మించి వారి పాపములనుండి విముక్తి పొందినారు. శివుని తల భాగము పడిన నేపాల్ లోని చౌలి మహేశ్వర్. పాండవులుచౌలిమహేశ్వర్ మినహా మిగిలిన పంచ కేదార్ ఆలయములు నిర్మించిన పిమ్మట ఆలయములందు కేదార్నాధ్ నందు తపస్సు యజ్ణము చేసి బదరీనాధుని దర్శించి మానా గ్రామమునుండి వారు స్వర్గారోహణ యాత్ర చేసినారు.