కల్పెశ్వర్

(5వ కేదార్)
(IPLTOURS)

పంచ కేదార్ లలో అయిదవ కేదార్ కల్పెశ్వర్ హిమాలయములలోని ఉత్తరాఖండ్ రాష్ట్రములో  గారెవాల్ నందు కల  సుందరమైన ఉర్గంలోయ ప్రాంతములో ఉన్నది. పంచ కేదార్ యాత్ర నందు ముందు కేదార్నాధ్, మధ్యమహేశ్వర్, తుంగనాధ్ మరియు రుద్రనాధ్  దేవాలయములు సందర్శించవలెను. రుద్రనాధ్ పిమ్మట కల్పెశ్వర్ దర్శించుకొన వలయును.

రుద్రనాధ్ దర్శనము పిమ్మట తిరిగి 23 కి.మీ కాలినడకన ట్రెక్కింగ్ చేసి ప్రయాణించి  సాగర్ మరియు గంగోల్ మీదుగా 5 కి.మీ  గోపేశ్వర్ ఆచటి నుండి 10 కి.మీ. ప్రయాణించి చామోలి చేరవలయును. చామోలి నుండి హెల్లాంగ్ మీదుగా 22 కి.మీ ప్రయాణించి దేవగ్రామ్ చేరి ఆచటి నుండి 3 కి.మీ కాలినడకన ప్రయాణించి కల్పెశ్వర్ చేరవచ్చును లేదా రుద్రనాధ్ నుండి 8 గంటలు ట్రెక్కింగ్ ద్వారా 18 కి.మీ ప్రయాణించి దుముక్ చేరి విశ్రమించి మరునాడు ఉదయము 7 గంటలు ట్రెక్కింగ్ చేసి 14 కి.మీ ప్రయాణించి కల్పెశ్వర్ మహదేవ్ దేవాలయము చేరవచ్చును. 

Kalpeshwar

తిరిగి కల్పెశ్వర్ నుండి 3 కి.మీ నడచి ఆచటి నుండి 12 కి.మీ ప్రయాణించి హెల్లాంగ్ ఆచటి నుండి 14 కి.మీ దూరములో నున్న జోషీమఠ్ చేరి పిమ్మట బద్రీనాథ్ వెళ్లవచ్చును. శివుని జటాఝూటము ఇచట శివభగవానునిగా కొలువబడు చున్నాడు. కల్పెశ్వర్ సముద్ర మట్టమునకు 7200 అడుగుల ఎత్తులో నున్నదిరుద్రనాధ్ మరియు కల్పెశ్వర్ ఆలయములందు ఆది శంకరాచార్యులచే నియమించ యాడిన దాసనమీ గోసన కులస్థులు పూజా కార్యక్రమములు నిర్వర్తించెదరు.

స్థల పురాణం ప్రకారం మహాభారత కాలమునందు పాండవులు తమ దాయాదులు కౌరవులను కురుక్షేత్ర సంగ్రామమునందు నిర్జించినారు. పాండవులు యుద్ధము నందు చేసిన పాపములైన గోత్రీకుల హత్య మరియు గోహత్యల నుండి విముక్తులు కావలెవ్లేనని తలంచి తమ రాజ్య భారమును తమ వంశీకుడు పరీక్షిత్తునకు ఆప్పగించి శివుని దర్శించి దీవెనలు పొందవలెనని వెతుకుచూ బయలుదేరినారు. వారు శివునికి ప్రీతి పాత్రమైన వారణాశి పుణ్య క్షేత్రమును చేరగా శివుడు వారిపై కురుక్షేత్ర సంగ్రామమునందు వారివలన కలిగిన ప్రాణ నష్టమునకు కోపగించి వారిప్రార్ధనలను వినిపించుకోకుండా వారినుండి తప్పించు కొనవలెనని తలచి ఎద్దు (నంది) రూపముపొంది హిమాలయ ప్రాంతమునందు అదృశ్యమైనాడు. వారణాశినందు శివుని కనుగొనలేక పాండవులు హిమాలయములకు వెళ్ళినారు.  

భీముడు గుప్తాక్షి వద్ద రెండు పర్వతముల మధ్య నిలబడి చూడగా నంది రూపములో శివుడు గుప్తాక్షి వద్ద గడ్డి మేయుచూ కనిపించినాడు. భీముడు నంది తోకపట్టుకొని ఆపుటకు ప్రయత్నించగా ఆచటి నుండి అదృశ్యమై తరువాత ప్రత్యక్షమై ఆరుభాగములుగా విడిపోయినది. మూపుర భాగము కేదార్నాధ్, చేతులు తుంగనాధ్, బొడ్డు మరియు ఉదరభాగము మధ్య మహేశ్వర్, ముఖ భాగము రుద్రనాధ్ మరియు జుట్టు కల్పెశ్వర్ లతో పాటు తల భాగము నేపాల్ నందు ఖాట్మండునకు 25 కి.మీ దూరములో చౌలి మహేశ్వర్ నందు పడినవి. 

పాండవులు శివుని కొలుచుటకు గాను చౌలిమహేశ్వర్ మినహా మిగిలిన అయిదు స్తలములలోనూ ఆలయములు నిర్మించి వారి పాపములనుండి విముక్తి పొందినారు. శివుని తల భాగము పడిన ప్రదేశము నేపాల్ లోని చౌలి మహేశ్వర్. పాండవులు చౌలిమహేశ్వర్ మినహా మిగిలిన  పంచ కేదార్ ఆలయములు నిర్మించిన పిమ్మట ఈ ఆలయములందు కేదార్నాధ్ నందు తపస్సు యజ్ణము చేసి బదరీనాధుని దర్శించి మానా గ్రామము నుండి వారు స్వర్గారోహణ యాత్ర చేసినారు.